Pawan kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) మానవతా దృక్పథాన్ని మరోసారి చూపించారు. ఇటీవల చిత్తూరు జిల్లాలోని పలమనేరు సమీపంలో జరిగిన పర్యటనలో, తోపులాట కారణంగా గాయపడిన హేమావతి అనే మహిళకు పవన్ ప్రత్యేకంగా శుభాకాంక్షల లేఖ, కొండపల్లి బొమ్మలు పంపించారు. ఈ కానుకలను జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ బాధితురాలి ఇంటికి వెళ్లి అందజేశారు. పవన్ కల్యాణ్ తన పట్ల చూపిన ఆదరణకు హేమావతి కృతజ్ఞతలు తెలుపుతూ, “ఇలాంటి పరామర్శ సాధారణ ప్రజలకు ఎంతో ధైర్యాన్నిస్తుంది” అని స్పందించారు.
Read also: Weather: తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి
Pawan kalyan: పవన్ కల్యాణ్ సాయం పట్ల బాధితురాలి కన్నీటి కృతజ్ఞత
హేమావతికి స్వల్ప గాయమైందని
Pawan kalyan: ఈ ఘటనపై జనసేన స్పష్టతనిచ్చింది. వేలాది మంది పవన్ను చూసేందుకు తరలివచ్చిన సమయంలో తోపులాట జరిగి హేమావతికి స్వల్ప గాయమైందని తెలిపింది. అయితే, వైసీపీ నేతలు ఈ సంఘటనను రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు పేర్కొన్నారు. బాధితురాలికి రూ. 10 వేల ఆర్థిక సాయం, నెలసరి అవసరాల సరఫరా అందించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: