ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), తన నియోజకవర్గమైన పిఠాపురం(Pithapuram) లో అభివృద్ధి పథకాలతో పాటు, మానవీయతకు నిదర్శనంగా నిలిచే ఎన్నో కార్యక్రమాలను స్వయంగా చేపడుతున్నారు. అధికారిక విధులు ఒకవైపు కొనసాగిస్తూనే, మరొకవైపు ప్రజల సంక్షేమం కోసం వ్యక్తిగతంగా ముందుకు వస్తున్నారు.
వేతనాన్ని అనాథ పిల్లల కోసం వినియోగిస్తున్న పవన్
తన ఎమ్మెల్యే వేతనాన్ని పూర్తిగా సామాజిక సేవకు వినియోగిస్తూ, ప్రతి నెలా అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇటీవలే పవన్ ఆదేశాల మేరకు పిఠాపురంలోని అనాథ పిల్లలకు ఈ మొత్తాన్ని జనసేన పార్టీ నేతలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సామాజిక బాధ్యతకు అద్దం పడుతున్నారు.
రాఖీ పండుగకు స్పెషల్ కానుక – వితంతువులకు చీరల పంపిణీ
రాఖీ పండుగను పురస్కరించుకుని పవన్ కల్యాణ్ మరో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని 1500 మంది వితంతు మహిళలకు చీరలు (Sarees for widows) పంపించారు. వీటిని తన తరపున జనసేన కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అందజేశారు.
“నేనున్నానంటూ” సోదరుడిగా భరోసా
పవన్ ఈ కార్యక్రమాన్ని కేవలం దానం కోసం చేయలేదు. ఆయన చెప్పినట్లు, వితంతు మహిళలకు సోదరుడిగా తాను అండగా ఉంటానన్న భావనను చాటేలా చీరలు పంపించారని తెలిపారు. ఈ చర్యతో ఆ మహిళల్లో భద్రతా భావనను, ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నదే లక్ష్యంగా జనసేన ప్రకటించింది.
రక్షాబంధన్ కానుకగా పంపిన చీరలను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పంపించి, పార్టీ కార్యకర్తలు, నేతలు, క్రియాశీల సభ్యులు పిఠాపురం నియోజకవర్గంలోని ఇంటింటికీ వెళ్లి మహిళలకు అందించారు. పవన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన్ని కేవలం ఎమ్మెల్యేగా కాకుండా, ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నామని జనసేన వెల్లడించింది.
మహిళల్లో ఉద్వేగం – పవన్పై కృతజ్ఞతలు
ఈ ప్రత్యేకమైన కానుక అందుకున్న వితంతు మహిళలు ఎంతో ఆనందానికి లోనయ్యారు. ఊహించని ఈ రాఖీ గిఫ్ట్తో కొందరు మహిళలు భావోద్వేగానికి లోనై, పవన్పై తమ కృతజ్ఞతలు వ్యక్తపరిచారు. ‘‘పవన్ అన్నయ్య నిజంగా మా కుటుంబ సభ్యుడిలా ఉన్నారు’’ అంటూ వారు స్పందించారు.
read hindi news: hindi.vaartha.com
Read also: