రాష్ట్రాభివృద్ధికి నిర్ణయించిన లక్ష్యాలను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (pawan kalyan) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సోమవారం విజయవాడ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత జరిగిన శాఖల కార్యదర్శుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం లేకుండా పని చేయాలని, పై నుంచి కిందస్థాయి వరకు అందరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కేవలం నివేదికలకే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితులను గుర్తించాలని అన్నారు. ప్రజలకు సేవలు నేరుగా చేరేలా కార్యాచరణ ఉండాలన్నారు.
Read also: YSRCP Leaders: పిన్నెల్లి సోదరులను పరామర్శించిన వైసీపీ నేతలు
Rs. 10 thousand crore works for Panchayat Raj schemes
రూ.10 వేల కోట్ల పనులు ప్రారంభం – అభివృద్ధిపై ఫోకస్
పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. పల్లె పండుగ కార్యక్రమానికి రూ.2,500 కోట్లు, అడవితల్లి బాటకు రూ.1,005 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ పథకాల కోసం మొత్తం రూ.11,328 కోట్లు కేటాయింపులు జరిగాయని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సదుపాయాల కోసం రూ.25 వేల కోట్ల నిధులు సమీకరించామని వివరించారు. ఈ పథకాలన్నీ ప్రజలకు ఉపయోగపడేలా అమలు కావాలని అధికారులను ఆదేశించారు.
తక్కువ వనరులతో అభివృద్ధి – కూటమి ప్రభుత్వ సంకల్పం
నిధుల కొరత ఉన్నప్పటికీ రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, అటవీ అభివృద్ధి, పట్టణ వనాల పెంపు వంటి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం లభిస్తోందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, అధికారులు నేరుగా పర్యవేక్షణ చేయాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: