📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Pawan Kalyan: డిప్యూటీ సీఎంను కలిసిన బాలకృష్ణ, నాగబాబు

Author Icon By Saritha
Updated: February 12, 2026 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్‌లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరుడిని కలిశారు.

Read Also: TTD: స్వామి వారికీ బ్యాటరీ వాహనాలు ఇచ్చి తన ఉదారతను చాటుకున్న భక్తుడు

Balakrishna, Nagababu meet Deputy CM

అంతకుముందు, శాసనసభలో మంత్రి లోకేశ్, నందమూరి బాలకృష్ణ (Balakrishna) పక్కపక్కనే కూర్చును మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ ఏదో చెబుతుండగా లోకేశ్ ఆసక్తిగా వింటున్నట్లు కనిపించింది. ఇదిలా ఉండగా, గిద్దలూరు నియోజకవర్గం సమస్యలపై పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. గతంలో అన్‌స్టాపబుల్‌ షో టైమ్‌లో వీళ్లద్దరూ కలిసారు. అధికారిక కార్యక్రమాల్లో ఎదురుపడ్డప్పుడు మర్యాదపూర్వక పలకరింపులు తప్ప ఇలా సమావేశం అయిన సందర్భాలు లేవు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గానికి సంబంధించిన అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగనట్టు చెప్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh Jana Sena Party Latest News in Telugu nagababu nandamuri balakrishna Pawan Kalyan tdp mla Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.