📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు వరుసగా 3 రోజులు సెలవులు రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు వీధి వ్యాపారులకు గుడ్‌న్యూస్ సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు

Parvathipuram: ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి

Author Icon By Pooja
Updated: January 24, 2026 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పార్వతీపురం(Parvathipuram) మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం వనజ గ్రామంలో హృదయవిదారక సంఘటన జరిగింది. ఇంట్లో చలి నివారణ కోసం వెలిగించిన నిప్పుల కుంపటి కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతోంది.

Read Also: UP: తన కాలును తానే నరుక్కున్న యువకుడు.. ఎందుకో తెలుసా?

A burning brazier claimed the lives of three people in the same family.

ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తొలుత, కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు భావించారు. అయితే పోలీసులు జరిపిన విచారణలో ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా తేలింది. డీఎస్పీ రాంబాబు, సీఐ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. వనజ గ్రామానికి చెందిన మీనక మధు (35), సత్యవతి (30) దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మాధురి చినమేరంగి కేజీబీవీలో చదువుకుంటుండగా, రెండో కుమార్తె మోక్ష తాతగారి ఊరు బొమ్మికలో ఉంటూ విద్యాభ్యాసం చేస్తోంది. చిన్నారులు అయేషా (6), మోస్య (4) తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.

ఉదయం తలుపులు తెరిచి చూడగా బయటపడ్డ నిజం

గురువారం రాత్రి మధు, సత్యవతి, అయేషా, మోస్య ఇంట్లోనే నిద్రించారు. శుక్రవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తెరుచుకోకపోవడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా నలుగురు కదలికలేని స్థితిలో కనిపించారు. వెంటనే వారిని చినమేరంగి సామాజిక ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురు మృతి, ఒకరికి చికిత్స

ఆసుపత్రిలో మధు, సత్యవతి, మోస్య అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయేషా పరిస్థితి విషమంగా ఉండటంతో పార్వతీపురం(Parvathipuram) జిల్లా ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నానికి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇంట్లో తలుపులు మూసి నిప్పుల కుంపటి వెలిగించడంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలై ఊపిరాడక ఈ దుర్ఘటన జరిగిందని తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

familytragedy FirePotAccident Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.