Paritala Sunitha: రైతులతో కలిసి పొలంలో పనిచేసిన ఎమ్మెల్యే

Read Time:  1 min
Paritala Sunitha
Paritala Sunitha
FONT SIZE
GET APP

ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ బాధ్యతలతో నిరంతరం బిజీగా ఉండే టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత(Paritala Sunitha) తాజాగా తన స్వగ్రామం వెంకటాపురం(Venkatapuram)లో ఉన్న వ్యవసాయ భూమిని సందర్శించారు. ఉదయాన్నే చలిని లెక్కచేయకుండా పొలంలోకి వెళ్లిన ఆమె, అక్కడ ఇప్పటికే వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కూలీలతో మమేకమై సాగు పనుల పురోగతిని తెలుసుకున్నారు.

Read Also: YS Jagan: జగన్ కు అస్వస్థత.. కార్యక్రమాలు రద్దు?

పొలంలో పెరుగుతున్న పంటలను దగ్గరగా పరిశీలించిన పరిటాల సునీత(Paritala Sunitha), స్వయంగా మిరపకాయలను కోసుతూ రైతు జీవితానికి తాను కూడా భాగస్వామినని చాటిచెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం ఇచ్చే సంతృప్తి, ఆనందం మరే రంగంలో దొరకదని చెప్పారు. రైతుల(Farmers) శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఆమె వ్యవసాయ పనుల్లో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకోబడి, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.