పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్ద ఈ రోజు ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు ప్రమాదానికి (Accident) గురవగా, ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది ప్రయాణికులు గాయపడినట్టు అధికారులు తెలిపారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే…
రాయచూరు నుంచి కొందరు యాత్రికులు ఓ ప్రైవేట్ బస్సులో కాశీ యాత్ర (Kashi yatra) కు బయలుదేరారు. వీరి బస్సు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కనమర్లపూడి వద్దకు రాగానే, కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. నరసరావుపేట నుంచి కర్నూలు వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ ఈ ప్రమాదం (Accident) లో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మరణించారు.
గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది భక్తులు గాయపడ్డారు(10 devotees injured). వీరిలో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి.
రహదారి పై ట్రాఫిక్ జామ్
ప్రమాదం జరిగిన ప్రదేశం కర్నూలు–గుంటూరు జాతీయ రహదారి ప్రధాన రూట్ కావడంతో, కొంతసేపు వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పలువురు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేయడంతోపాటు, సహాయక చర్యలు చేపట్టారు.
వేగవంతమైన డ్రైవింగ్
ప్రాథమిక సమాచారం మేరకు బస్సు డ్రైవర్ అతివేగంగా వాహనం నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడటంతో, డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Chandrababu: తిమ్మరాజుపల్లిలో సీఎం చంద్రబాబు ఇంటింటి పర్యటన