📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

P4 : P4 – ప్రపంచంలోనే ప్రత్యేకమైన కార్యక్రమం : చంద్రబాబు

Author Icon By Divya Vani M
Updated: April 5, 2025 • 7:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో మార్పు కోసం ముందడుగు వేసేలా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సందేశం అందరినీ ఆలోచింపజేసింది. ‘సమాజానికి మనం ఏదైనా మంచి చేయగలిగితే, అదే నిజమైన గౌరవం,’అని ఆయన చెప్పారు. డబ్బు వల్ల గౌరవం రాదు. కానీ మంచి పనులు చేస్తే గుర్తింపు మాత్రం తథ్యం అని స్పష్టంగా తెలిపారు.నందిగామ మండలంలోని ముప్పాళ్లలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తర్వాత మార్గదర్శి-బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా 41 పేద కుటుంబాలను గుర్తించి, వారికి చేయూతనిస్తూ మానవతా విలువలు చాటారు. గ్రామ సభలో ప్రజల సమస్యలు నేరుగా విని, మార్గదర్శి గోగినేని రవిచంద్రను ఘనంగా సన్మానించారు.చంద్రబాబు చెప్పినట్లుగా ‘పీ4’ ఒక వినూత్న ఆలోచన. ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ఈ పథకం పేదల జీవితాల్లో వెలుగు నింపుతోంది.

P4 P4 ప్రపంచంలోనే ప్రత్యేకమైన కార్యక్రమం చంద్రబాబు

ఆయ‌న అంబేద్కర్, అబ్దుల్ కలాం, వివేకానంద ఉదాహరణలు చూపిస్తూ, మంచి మార్గదర్శులు ఉంటే ఎంతటి మార్పు సాధ్యమవుతుందో వివరించారు.‘మేం కూడా చిన్న కుటుంబాల్లో పుట్టాం.అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఎదిగాం. మీ పిల్లలు కూడా ఇదేలా ఎదగాలి,’’ అని చంద్రబాబు స్పష్టంచేశారు. పీ4 ద్వారా ప్రతి పేద కుటుంబం ఎదగే అవకాశం పొందుతోందని తెలిపారు.తోటకూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తాము బ్రిక్స్ ఫ్యాక్టరీ ప్రారంభించి ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నామని చెప్పారు. పీ4ను డిజిటల్ మార్కెట్‌లో ప్రచారం చేస్తామని తెలిపారు.జయేష్ కుమార్ షా,‘ఈ మట్టి మాకు ఎంతో ఇచ్చింది. ఇప్పుడు సమాజానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. పీ4 గురించి తెలుసుకున్న వెంటనే ఉత్సాహంగా ముందుకు వచ్చాం’ అని చెప్పారు.మధుసూధన్ రావు మాట్లాడుతూ, ముక్త్యాల గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు తెలిపారు. వందల మందికి హెల్త్ కార్డులు ఇచ్చామని చెప్పారు.వల్లభనేని రామకృష్ణ, ‘‘మీ స్ఫూర్తితో మేం ఓ కుటుంబాన్ని దత్తత తీసుకుని, విద్య, వైద్య సేవల్లో స హాయం చేస్తాం’’ అన్నారు.

READ ALSO : Ram Charan: ‘పెద్ది గ్లింప్స్’ మామూలుగా లేదు : రామ్ చరణ్

Babu Jagjivan Ram Jayanti Bangaru Kutumbam Scheme Chandrababu Naidu Margadarsi Initiative Nandigama Constituency NTR District News P4 Program Poverty Eradication in AP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.