Online Shopping: ఆన్లైన్ కొనుగోళ్లలో విజయవాడ ముందంజ

Read Time:  1 min
Online Shopping
Online Shopping
FONT SIZE
GET APP

ఒకప్పుడు ఇంటి అవసరాల కోసం జాబితా రాసుకుని దుకాణాలకు వెళ్లే పరిస్థితి ఉండేది. కానీ కాలం మారడంతో పాటు కొనుగోలు విధానమూ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మొబైల్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు—నిత్యవసరాల నుంచి ఖరీదైన ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని వస్తువులు నేరుగా ఇంటి వద్దకే చేరుతున్నాయి. ఈ మారుతున్న ట్రెండ్‌కు(Online Shopping) విజయవాడ వాసులు కొత్త అర్థం చెబుతున్నారు.

Read Also: Whats App: గత నెలలో 29 లక్షల ఖాతాలను బ్లాక్ చేసిన వాట్సాప్

Online Shopping
Online Shopping: Vijayawada leads in online purchases.

రాష్ట్రంలోనే ముందంజలో విజయవాడ

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ఇప్పటికే ప్రధాన వ్యాపార కేంద్రంగా గుర్తింపు పొందింది. 2025లో ఈ నగరం పూర్తిగా కొత్త తరహా షాపింగ్ సంస్కృతిని స్వీకరించింది. కూరగాయల నుంచి ప్రీమియం ఉత్పత్తుల వరకు అన్ని ఆన్లైన్‌లోనే(Online Shopping) ఆర్డర్ చేస్తూ, కార్పొరేట్ నగరాలకు దీటుగా నిలుస్తోంది. ఉదయం నిత్యావసరాల కొనుగోళ్లతో మొదలై, రాత్రికి బ్యూటీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల వరకు డోర్ డెలివరీనే ప్రజలు ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు.

క్విక్ కామర్స్ నివేదికలో సంచలన గణాంకాలు

దేశంలోని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ ఇన్ఫ్లో మార్ట్ విడుదల చేసిన తాజా నివేదిక విజయవాడలో కొనుగోళ్ల పెరుగుదలను స్పష్టంగా చూపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే నగరంలో అనేక కేటగిరీలలో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు వెల్లడైంది.

నివేదిక ప్రకారం—

  • బ్యాగులు, వాలెట్ల కొనుగోళ్లు 538% పెరిగాయి
  • క్రీడలు, ఫిట్నెస్ పరికరాలు 495% వృద్ధి సాధించాయి
  • బ్యూటీ ప్రొడక్ట్స్, ఆభరణాల్లో 330% పెరుగుదల నమోదైంది
  • బొమ్మల విభాగంలో 240%
  • ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో 223% వృద్ధి కనిపించింది

నిత్యవసరాల నుంచి ప్రీమియం ఉత్పత్తుల వరకు డిమాండ్

ఉదయం వేళల్లో ముఖ్యంగా నిత్యవసర సరుకుల ఆర్డర్లు అధికంగా ఉంటున్నాయి. వీటిలో చుక్కకూరకు ఎక్కువ డిమాండ్ ఉండగా, తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు ఉన్నాయి. బంగాళదుంపలు, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతోంది. అలాగే థమ్స్ అప్, లేస్, బింగో, కురుకురే, పంచదార, బిస్లరీ, విమ్ వంటి బ్రాండ్లు వినియోగదారుల ఎంపికలో ముందంజలో ఉన్నాయి.

ప్రీమియం షాపింగ్‌లోనూ బెజవాడ వాసుల దూకుడు

ప్రీమియం షాపింగ్ విషయంలోనూ విజయవాడ వాసులు వెనుకబడ్డారు కాదు. నగరానికి చెందిన ఓ వ్యక్తి ఒక్క ఏడాదిలోనే రూ.3.62 లక్షల విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేసి టాప్‌లో నిలిచినట్లు నివేదిక తెలిపింది. మరో నలుగురు వినియోగదారులు రూ.3 లక్షలకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ గణాంకాలు విజయవాడ ప్రజలు ధర కంటే నాణ్యత, సౌకర్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.