📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: NTR District: అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి.. స్కూల్ లోకి అనుమతించని యాజమాన్యం

Author Icon By Anusha
Updated: November 1, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్టీఆర్ జిల్లా (NTR District) గొల్లపూడిలోని జీఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది. అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని యాజమాన్యం లోపలికి అనుమతించకపోవడంతో, స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే, పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం స్కూలుకు వెళ్లాడు.

Read Also: Srikakulam Stampede: తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశం

అయితే పాఠశాల యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించి వేసింది. ఈ సమాచారం అందుకున్న అయ్యప్ప మాలధారులు, ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. మాల (Ayyappa Mala) ధరించిన విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించకపోవడం ఏంటని ప్రశ్నించారు.

NTR District

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు

వివాదం పెద్దదికావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన భవానీపురం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఈ విషయంలో ఇరువురికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకపోవడంతో అయ్యప్ప దీక్షదారులంతా కలిసి ఈ విషయాన్ని డీఈవో యు.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన  ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడడంతో సమస్య సద్దుమనిగింది. కాగా జరిగిన సంఘటనపై అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పి విద్యార్థిని అనుమతిస్తామని చెప్పారు. ఇదే క్రమంలో ఇటీవల విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు ఉన్నత పాఠశాలలో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో వివాదం చోటు చేసుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

ayyappa student denied entry latest news ntr district Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.