📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ – చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: January 23, 2025 • 6:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ గ్లోబల్ మర్చంట్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. “1997 నుంచి దావోస్‌కి హాజరౌతున్నాను. అప్పట్లో భారత్‌కు అంతగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం భారత్ వైపుగా చూస్తోంది. 2028 నాటికి భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రపంచంలో భారత్ “అన్స్టాపబుల్ ” అని చంద్రబాబు చెప్పారు.

అలాగే ఇక్కడ వేర్వేరు రాజకీయ పార్టీల ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ, దేశం అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కలిసి పనిచేస్తే మాత్రమే వికసిత భారత్ సాధ్యమవుతుంది అని తెలిపారు. వ్యవసాయం, మానవాభివృద్ధి రంగాలలో డీప్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఈ అభివృద్ధి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 165 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని, ఆ దిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

దావోస్‌లో తొలిసారి భారత్ తరఫున అన్ని రాష్ట్రాల నాయకులు కలిసి ఒకే వేదికపై చర్చలు జరిపారని చంద్రబాబు వివరించారు. “ఇది భారత అభివృద్ధి దిశలో ఒక పెద్ద ముందడుగు. అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేయడం వల్ల దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఈ సదస్సు ద్వారా భారత్‌కి మరింత గౌరవం పెరిగింది” అని అన్నారు.

చంద్రబాబుతో పాటు దావోస్‌ సదస్సులో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భారత్ అభివృద్ధి పట్ల తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి రాష్ట్రం తనవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, దావోస్ వేదిక ద్వారా ఈ సందేశం ప్రపంచానికి వెళ్లిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Chandrababu Davos Summit 2025 India is unstoppable

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.