ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం నిలబెట్టుకోలేదని, జగన్ పాలనలో “రెడ్ బుక్ రాజ్యాంగం” నడిచిందని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu) తీవ్ర విమర్శలు చేశారు.
పాలకొల్లులో ఘాటు వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు (Nimmala Ramanayudu), జగన్ (jagan) ప్రభుత్వం కాలంలో ప్రజలకు మేలు చేసేందుకు ఒక్క అడుగు కూడా వేయలేదని విమర్శించారు. “అక్రమ కేసులు, కక్షసాధింపు చర్యలు, దాడులు – ఇవే ఆ పాలన చిహ్నాలు. ప్రజల సంక్షేమం పూర్తిగా మరచిపోయారు” అని వ్యాఖ్యానించారు.
సాక్షి దినపత్రికపై ఆగ్రహం
వైసీపీ నేతలు క్రికెట్ బెట్టింగ్లో చిక్కుకున్నా, అక్రమంగా సంపాదించిన ఆస్తులు బయటపడినా.. ఆ విషయాలు సాక్షి పత్రికలో ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తనపై మాత్రం కావాలనే తప్పుడు వార్తలు ప్రచురించడం దుష్ప్రచారానికి నిదర్శనమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో తన నియోజకవర్గం పాలకొల్లులో రూ. 430 కోట్ల అభివృద్ధి పనులు (430 crore development works) జరుగుతున్నాయని మంత్రి వివరించారు. ప్రజలకు గృహాలు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
టిడ్కో గృహాల విషయంలో వైసీపీ తీరుపై తీవ్ర విమర్శ
“మేము నిర్మించిన టిడ్కో గృహాలపై జగన్ హయాంలో ఒక్క ఇంటికీ రూ. 3.65 లక్షల రుణం తీసుకుని దారి మళ్లించారు” అని ఆరోపించారు. టిడ్కో ప్రారంభోత్సవ సభలో తమను బహిరంగంగా స్టేజ్ నుంచి దింపిన ఘటనను గుర్తు చేస్తూ, అప్పట్లో సాక్షి పత్రిక మౌనం ఎందుకు వహించిందని నిలదీశారు. “మేమే దాడులకు గురయ్యాం. అయినా మాపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఇది జగన్ పాలనలోనూ ప్రజాస్వామ్యంపై జరిగిన అతి పెద్ద దాడి” అని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: