News Telugu: విశాఖలో చోటుచేసుకున్న ఓ దారుణం అందరినీ కలచివేసింది. ఆడపిల్లలకు రక్షణగా నిలవాల్సిన తండ్రే క్రూరమృగంలా మారాడు. ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడి (Sexual assault on children)కి పాల్పడిన తండ్రికి పాక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు, జరిమానా విధించి బాధిత బాలికలకు ప్రభుత్వం పరిహారం అందించాలని ఆదేశించింది.
ఉపాధి కోసం విశాఖకు – కుటుంబాన్ని మోసం చేసిన తండ్రి
ఒరిస్సాకు చెందిన చిత్తరంజన్ పాత్రో (Chittaranjan Patro), ఉపాధి కోసం కుటుంబంతో కలిసి విశాఖకు వచ్చాడు. భార్య కార్పొరేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఎక్కువగా రాత్రివేళల్లో డ్యూటీకి వెళ్లేది. ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోని తండ్రి, తన స్వంత కూతుళ్లపై కన్నేసి, వారిపై అమానుషంగా ప్రవర్తించాడు.
చిన్నారులపై అమానుష చర్యలు
మొదట పెద్ద కుమార్తె (12 ఏళ్లు)పై లైంగిక దాడి చేశాడు. భయంతో పిల్లలు నోరు విప్పలేకపోయారు. అలా కొనసాగిన క్రూరకృత్యం తర్వాత, చిన్న కుమార్తె (8 ఏళ్లు)ను కూడా వదలకుండా దాడి చేశాడు. తండ్రి కనపడితేనే భయంతో వణికే స్థితికి చేరుకున్నారు బాలికలు. ఎవరికీ చెప్పుకోలేక లోలోన పంటి బిగువున్న బాధను భరిస్తూ వచ్చారు.
టీచర్ గమనికతో వెలుగులోకి వచ్చిన నిజం
అయితే పెద్ద కుమార్తె పాఠశాలలో మౌనంగా ఉండటం టీచర్ గమనించింది. కౌన్సెలింగ్ సమయంలో బాలిక కన్నీరుమున్నీరై వాస్తవాన్ని బయటపెట్టింది. వెంటనే ఈ విషయం పోలీసులకు చేరింది. 2024 సెప్టెంబర్ 24న ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి, తరువాత మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
దర్యాప్తు మరియు ఆధారాలు
ఏసీపీ పెంటారావు నేతృత్వంలోని బృందం నిశితంగా దర్యాప్తు చేసి, పూర్తి ఆధారాలతో ఛార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. నేరం నిర్ధారణ కావడంతో కేసు విచారణ చేపట్టిన పాక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కోర్టు తీర్పు – కఠిన శిక్ష
న్యాయస్థానం నిందితుడు చిత్తరంజన్ పాత్రోకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదనంగా రూ. 3,000 జరిమానా విధించింది. బాధిత బాలికలకు సహాయంగా రూ. 3 లక్షల పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: