News Telugu: Sajjala Ramakrishna Reddy – 9 న అన్నదాన పోరుకు సిద్దమవుతున్న వైసీపీ

Read Time:  1 min
News Telugu
News Telugu
FONT SIZE
GET APP

రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో, వైసీపీ కూటమి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట ‘అన్నదాత పోరు’ పేరిట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు పార్టీ నాయకులు ప్రకటించారు.

పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పలువురు కీలక నేతలతో కలిసి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రైతులను పూర్తిగా విస్మరించిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. “జగన్ మోహన్ రెడ్డి హయాంలో రైతులకు అందించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసింది” అని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వంపై సజ్జల విమర్శలు

సజ్జల మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎరువుల కొరతను సృష్టిస్తోందని, రైతులను క్యూలైన్లలో గంటల తరబడి నిలబెట్టి ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. “ఒకవైపు కొరత లేదని చెబుతూనే, మరోవైపు రైతులను అవమానపరుస్తున్నారు. అంతేకాదు, టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు యూరియా (Urea) ను అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. ఈ విధంగా ఎరువుల మాఫియాను నడిపిస్తున్నారు” అని ఆయన విమర్శించారు.

అలాగే, రైతులు తమ సమస్యలపై ప్రశ్నించినప్పుడు వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. “రైతులను రక్షించాల్సిన ప్రభుత్వం వారినే కేసులు పెట్టి భయపెట్టడం దారుణం” అని అన్నారు.

News Telugu
News Telugu

చంద్రబాబుపై ఆరోపణలు

ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై కూడా సజ్జల మండిపడ్డారు. “యూరియా వాడితే కేన్సర్ వస్తుందంటూ రైతులను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. సంక్షోభం సృష్టించి లబ్ధి పొందడమే చంద్రబాబుకు తెలుసు” అంటూ సజ్జల ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 9న తలపెట్టిన ‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జలతో పాటు పార్టీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, వెల్లంపల్లి శ్రీనివాస్, టీజేఆర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-trishula-bath-as-a-feast-for-the-eyes-in-kanipakam/andhra-pradesh/542508/

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.