News Telugu: విజయవాడ నుండి జగ్గయ్యపేట (Jaggaiahpet) వెళ్తున్న ఒక బస్సులో ప్రయాణికులకు అసహజమైన సంఘటన చోటుచేసుకుంది. సీటు కోసం ఇద్దరు మహిళలు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఆ వాగ్వాదం క్రమంగా కొట్లాటగా మారింది.

డ్రైవర్ తెలివైన నిర్ణయం
సీటు కోసం మొదలైన గొడవ ఆగకపోవడంతో డ్రైవర్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు. ప్రయాణికులు ఎంతగా అడ్డుకున్నా మహిళలు ఆగకపోవడంతో, పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన డ్రైవర్ బస్సును నేరుగా సమీప పోలీస్ స్టేషన్ (Take the bus directly police station)కు తీసుకెళ్లాడు.
పోలీసుల కేసు నమోదు
పోలీసులు మహిళలను స్టేషన్లోకి తీసుకువెళ్లి విచారించారు. పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి గొడవలు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించారని పోలీసులు మహిళలపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ శాస్త్రం (BNS) కింద కేసులు నమోదు చేశారు. సంబంధిత సెక్షన్లు ,సెక్షన్ 3, సెక్షన్ 126(2), సెక్షన్ 115(2), సెక్షన్ 351(2) ప్రయాణికుల భద్రతకు భంగం కలిగించడం వంటి కారణాలకుగాను ఈ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: