తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతి(New Train) నుండి మహారాష్ట్ర షిర్డీకి సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ రైలును మంగళవారం ఉదయం తిరుపతి రైల్వే స్టేషన్లో(Tirupati railway station) రాష్ట్ర రోడ్లుభవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాస్తవ, టిటిడి బోర్డు సభ్యుడు జి. భానుప్రకాశ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణచక్రవర్తి. ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాష్ట్రపచ్చదనం సుందరీకరణ చైర్పర్సన్ ఎం.సుగుణమ్మ, విజయవాడ ఆర్అండ్ బి ఇఎన్సి ఎంవిఆర్ వివేకానందరెడ్డి, తిరుపతి రైల్వే మేనేజన్ సత్యనారాయణ కలసి జెండా ఊపి ప్రారంభించారు.
Read also: బియ్యం, చక్కెరతోపాటు రాగులు, గోధుమ పిండి

తిరుపతిలో సాయినగర్ ఎక్స్ప్రెస్ ఆరంభం
తిరుపతి నుండి షిర్డీకి(New Train) వెళ్ళే ప్రయాణీకులు, యాత్రికుల సౌలభ్యం కోసం ఈ రైలు నడపడం శుభపరిణా మమన్నారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ ప్రత్యక్ష అనుసంధానమైన రైలును నడపడం యాత్రికులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కాగా ఈ రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వి, సోమన్న, రాజ్యసభ సభ్యుడు రఘునాధ్ రెడ్డి వర్చువల్గా పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: