TB Patients Nutrition Kits: జిల్లా క్షయనివారణ అధికారి కార్యాలయంలో శనివారం 200 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ పి. శైలజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
Read Also: Massive Explosion in Vetlapalem : కాకినాడకు బయల్దేరిన చంద్రబాబు
ప్రైవేటు సంస్థల సహకారం
శ్రీ సిటీకి చెందిన మ్యాండాలిస్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (భాస్కర్ కుమార్, యశ్వంత్ రెడ్డి, సురేంద్ర కుమార్) వారి ఆర్థిక సహకారంతో, బాల భారత్ రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు ఫజల్ మరియు బాలాజీల సమన్వయంతో ఈ కిట్లను పంపిణీ చేశారు. వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకోవడానికి మందులతో పాటు బలవర్ధకమైన ఆహారం ఎంతో అవసరమని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
TB Patients Nutrition Kits: పాల్గొన్న అధికారులు
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, డీపీసీ సుకన్య, పీపీఎం కిరణ్ కుమార్, మరియు జిల్లా స్థాయి ఎన్.టి.ఇ.పి (NTEP) ఉద్యోగులు, ఎస్.టి.ఎల్.ఎస్, ఎస్.టి.ఎస్ మరియు టీబీ హెచ్.వీలు పాల్గొన్నారు. రోగులకు సరైన సమయంలో చికిత్స అందించడమే కాకుండా, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపడం అభినందనీయమని అధికారులు తెలిపారు.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :