📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

News Telugu: Nellore Crime: భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.. స్టేషన్లను తనిఖీ చేసిన ఐజి

Author Icon By Rajitha
Updated: December 10, 2025 • 12:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నెల్లూరు క్రైమ్ : నగరంలోని వేదాయపాలెం, నెల్లూరు రూరల్తో పాటు పొదలకూరు రాపూరు పోలీసు స్టేషన్లను గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి, జిల్లా యస్.పి. అజిత వేజెండ్లతో కలిసి మంగళవారం తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ల మ్యాప్ లను పరిశీలిస్తూ, స్టేషన్స్ పరిధిలో ఉన్న పరిస్థితులు, నేర ప్రాంతాలపై ఆరా తీశారు. గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి జిల్లాలోని పలు స్టేషన్లను తనిఖీ చేసిన ఐజి. పోలీస్ స్టేషన్లో ఉన్న పెండింగ్ కేసులు, క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో స్వయంగా ఐజి మాట్లాడి, వారి సమస్యను తెలుసుకున్నారు.

Read also: AP: మంత్రి లోకేష్ బిజీబిజీ.. ప్రముఖ కంపెనీల సిఇఓలతో వరుస భేటీలు

Nellore Crime

సమస్యలను ఓపికగా విని

ప్రతి ఫిర్యాదుదారుని మర్యాదపూర్వకంగా పలకరించి, వారి సమస్యలను ఓపికగా విని, పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, ల్యాండ్ గ్రాబర్ పై నిరంతరం నిఘా ఉంచాలని, వారి కదలికలపై ఇంటెలిజెన్స్ సేకరించి, లా అండ్ ఆర్డర్ కు హాని కలిగించే ప్రయత్నాలు ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి సేవించే వారు, అమ్మే వారిపై కఠినంగా కేసులు నమోదు చేసి నెట్ వర్క్ పూర్తిగా నిరోధించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బ్లాక్ స్పాట్లను గురించి, రోడ్డు భద్రత నియమాల గురించి వాహనదారులతో పాటు పట్టణ, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.

దొంగల గ్యాంగ్స్ పై ప్రత్యేక పర్యవేక్షణ

అన్ని పెండింగ్ కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా గ్రేవ్ క్రైమ్స్, ప్రాపర్టీ ఆఫెన్స్ కేసులపై వేగవంతంగా విచారణ జరపాలని ఆదేశించారు. దొంగతనం కేసుల్లో కోల్పోయిన సొత్తును త్వరగా రికవరీ చేసి బాధితులకు తిరిగి. అందించాలని, రికవరీ రేటు పెరగాలని, దొంగల గ్యాంగ్స్ పై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా మహిళలను, వ్యాపారులను, సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీసు సిబ్బంది సంక్షేమమే ప్రధమ కర్తవ్యమని, స్టేషన్ సిబ్బంది యోగ క్షేమాలు అడిగి, ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని వారి గ్రీవెన్స్ ను అడిగి, వెంటనే పరిష్కరించేలా అధికారులను ఆదేశించారు. సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ap police Guntur Range IG latest news Nellore Crime Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.