Nellore Accident: కంకర లోడుతో దూసుకెళ్లిన టిప్పర్.. ఐదేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

Read Time:  1 min
Nellore Accident
Nellore Accident
FONT SIZE
GET APP

నెల్లూరు జిల్లా(Nellore Accident) సైదాపురం మండల కేంద్రంలో భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాపూరు రహదారిపై జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.

Read Also: Garuda Varadhi: గరుడ వారధిపై రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Nellore Accident

బాలుడి పరిస్థితి విషమం

సైదాపురం(Nellore Accident) గ్రామంలోని ఎస్టీ కాలనీ సమీపంలో, కంకర లోడుతో గూడూరు వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఐదేళ్ల బాలుడు దక్షేశ్పై నుండి వెళ్లిపోయింది. ప్రమాదంలో బాలుడికి పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ఈ రహదారిపై అనుమతించిన సామర్థ్యానికి మించి టిప్పర్ వాహనాలు తిరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 25 టన్నుల పరిమితి ఉన్న వాహనాల్లో 35 నుంచి 45 టన్నుల వరకు కంకర తరలిస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్లక్ష్యమే తరచూ ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.