📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్

Author Icon By Anusha
Updated: July 16, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రూ.15వేలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తారకానాథ్

నెల్లిమర్ల, (విజయనగరం జిల్లా) : నెల్లిమర్ల నగరపంచాయతీ కమిషనర్ ఏ. తారక్నాథ్ మంగళవారం ఏసీబీకి చిక్కారు. పట్టణంలోని పద్మశాలివీధిలో నివసిస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి ఇంటి నిర్మాణం నిమిత్తం ప్లాన్ అప్రూవల్ కోసం మున్సిపల్ కార్యాలయంలోని తన గదిలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ రమ్య అందించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల నగర పంచాయతీ (Nellimarla Nagar Panchayat) పరిధిలోని పద్మశాలివీధిలో నివశిస్తున్న బురిడి మహేష్ అదే వీధిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. సదరు ఇంటికి ప్లాన్ అప్రూవల్ నిమిత్తం ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు.

కమిషనర్ అంగీకరించలేదు

అయితే ప్లాన్ అప్రూవల్ కోసం నగర పంచాయతీ కమిషనర్ తారకానాథ్ మహేష్ నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. రూ.15 వేలు నగదు రూపంలో, మిగిలిన రూ.5 వేలకు దివాన్ కాట్ బెడ్ ఇవ్వాలని కోరారు. ప్లాన్ కోసం అవసరమైన ఫీజు చెల్లించానని, లంచం ఇవ్వలేనని మహేష్ ప్రాధేయపడ్డారు. అయినా సరే కమిషనర్ అంగీకరించలేదు. దీంతో మహేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్కు వెళ్లిన మహేష్ రూ.15 వేలు అందజేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమ్య (ACB DSP Ramya) ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్గా కమిషనర్ తారకానాథ్ ను, పట్టుకున్నారు.

Nellimarla Commissioner: ఎసిబి వలలో నెల్లిమర్ల కమిషనర్

అనేక ఆరోపణలు

కేసు నమోదు చేశామని, బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. నగర పంచాయతీ కమిషనర్ తారక్నాథ్ (Tarakanath) పై మొదటి నుంచి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రతి భవనం వద్దకు వెళ్లి లంచాలు డిమాండ్ చేసినట్లు విమర్శలు గుప్పుమన్నాయి. ఇదే విషయాన్ని గత మూడు దఫాలుగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించారు. ఒకానొక సందర్భంలో బాధితులతోనే నేరుగా సమావేశాల్లో చెప్పించారు. అయినా సరే కమిషనర్ తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరుకు ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇంతలోనే ఏసీబీ అధికారులకు పట్టుబడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

నెల్లిమర్ల దేనికి ప్రసిద్ధి?

నెల్లిమర్ల జనపనార మిల్లు ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద వాటిలో ఒకటి. దీనికి జగదీష్ సర్దా ఛైర్మన్‌గా ఉన్నారు. ఇది కొంతకాలం క్రితం గోల్డెన్ మిల్ అని పిలువబడే సాకింగ్ యూనిట్. దీని బస్తాలు ప్రీమియం నాణ్యత కలిగి ఉంటాయి. భారతదేశంలోని అత్యుత్తమమైన వాటిలో ఒకటి.

నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎవరు?

లోకం నాగ మాధవి 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ నుండి గెలిచి ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యే .

Read hindi news: hindi.vaartha.com

Read Also: TTD: అలిపిరి పాదాలమండపంలో ఆలయ శుద్ధి

ACB Arrest Andhra Pradesh News Anti-Corruption Bureau Breaking News Bribery Case latest news Municipal Commissioner Nellimarla Nellimarla Municipality Taraknath Vizianagaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.