📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Today News : Cancer – క్యాన్సర్ కేసుల గుర్తింపునకు ఎన్సీడీ 4.0 సర్వే

Author Icon By Shravan
Updated: August 21, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ (Cancer) లక్షణాలున్న వారిని ప్రాథమిక
దశలోనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం వచ్చే అక్టోబరు నుంచి అసంక్రమిత వ్యాధుల (ఎన్సీడీ) 4.0 సర్వే పేరిట ఇంటింటా వివరాలు సేకరించనుంది. సర్వే తీరుపై ఈ నెల 21 నుంచి సెప్టెంబరు 20 వరకు 18 వేల మంది వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సహాయకులకు వైద్య ఆరోగ్య శాఖ శిక్షణ ఇవ్వనుంది. గతేడాది నవంబర్లో నిర్వహించిన ఎస్సీడీ 3.0 సర్వేలో రక్తపోటు, మధుమేహం, క్యాస్సర్ పీడితులను గుర్తించారు. నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ లక్షణాలు (Cancer symptoms) ఉన్నవారిలో కొందరు వివరాలు చెప్పడానికి, పరీక్షలకు ఆసక్తి చూపలేదు. తద్వారా వాస్తవ పరిస్థితులు వెలుగులోకి రాలేదు. తాజా సర్వేలో కేవలం క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని మాత్రమే గుర్తించనున్నారు. సర్వే లక్ష్యాలపై జనంలో అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారంతో పాటు ప్రజాప్రతినిథులను కూడ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్సీడీ 3.0 సర్వేలో ఆరోగ్యశాఖ 225 ప్రశ్నలు అడిగింది. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టడం ఇబ్బందిగా మారింది. 4.0 సర్వేలో ప్రశ్నలను 28కి తగ్గించారు. 18 ఏళ్ళు పైబడిన 4.10 కోట్ల మంది నుంచి ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబడతారు. పురుషుల్లో నోటి క్యాన్సర్ మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారి వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక స్థాయిలో సర్వేలో ఓ అంచనాకు వచ్చి వైద్యల సమక్షంలో మరోసారి పరీక్షిస్తారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/the-seven-hills-are-getting-ready-in-full-splendor-for-the-brahmotsavam/andhra-pradesh/533477/

Breaking News in Telugu Cancer Awareness Cancer Detection in India Cancer Screening Program Healthcare in Telangana Latest News in Telugu NCD 4.0 Survey Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.