Navaratri-తిరుమలేశునికి అంగరంగ వైభవంగా జరిగే సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలో, పట్టపురాణి తిరుచానూరులో కొలువైన పద్మావతి(Padmavathi) అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తొమ్మిది రోజుల విశేష పూజలు
దసరా నవరాత్రి(Dussehra Navratri) ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు జరగనున్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి 4.30 గంటల వరకు ఆలయంలోని కృష్ణస్వామి ముఖ మండపంలో ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్ళతో విశేష స్నపన తిరుమంజనం జరుగుతుంది.

విజయదశమి గజవాహన ఊరేగింపు
అక్టోబర్ 2న విజయదశమి(Vijaya Dashami) రోజున రాత్రి 7.45 గంటలకు అమ్మవారు గజవాహనంపై ప్రత్యేకంగా ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవం భక్తుల కోసం ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల కారణంగా 10 రోజులు కల్యాణోత్సవం రద్దు చేశారు. అలాగే సెప్టెంబర్ 26న జరిగే లక్ష్మీ పూజ సేవలు కూడా రద్దు అయ్యాయి.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి?
సెప్టెంబర్ 22 నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
నవరాత్రి ఉత్సవాల్లో ఏ ప్రత్యేక సేవలు ఉంటాయి?
ప్రతిరోజూ స్నపన తిరుమంజనం, విశేష అలంకరణలు మరియు విజయదశమి రోజున గజవాహన ఊరేగింపు జరుగుతుంది.
Read Hindi News: hindi.vaartha.com
Read also :