Latest news: National Highway: ఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా రైల్వే గేటు మూసివేత

Read Time:  1 min
National Highway
National Highway
FONT SIZE
GET APP

పశ్చిమ గోదావరి జిల్లా(National Highway) ఉండి ప్రాంతంలో 165 జాతీయ రహదారిపై డిసెంబర్ 1 నుండి 20 వరకు రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇది ఉండిలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనుల భాగంగా ఏడో నంబర్ పిల్లర్ పునర్నిర్మాణం కోసం జరుగుతుంది. వాహన రాకపోకలకు అవరోధం లేకుండా, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు.

Read also: లోపాలున్న స్లీపర్ బస్సులు వెంటనే తొలగించాలి

National Highway
Railway gate closed due to overbridge work

ప్రత్యామ్నాయ మార్గాలు, పనుల వివరాలు

ప్రయాణికులు(National Highway) నరసాపురం, పాలకొల్లు, భీమవరం,(Bhimavaram) ఉండి నుంచి ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడకు వెళ్లాలంటే, ఉండి, పాములపర్రు, పెదకాపవరం, గుమ్ములూరు, ఆకివీడు మార్గాలను ఉపయోగించాలని సూచించారు. అలాగే గుడివాడ, ఏలూరు, కైకలూరు నుంచి భీమవరం వెళ్లే వాహనాలు జువ్వలపాలెం, కాళ్ల, పెదఅమిరం మార్గాల ద్వారా ప్రయాణించాలి. ఆకివీడు నుంచి చెరుకువాడ, కలిసిపూడి, ఉండి పెదపుల్లేరు వంతెన మార్గంలో భీమవరం చేరాలని సూచనలున్నాయి. ఇద్దరు శాఖల అధ్వర్యంలో ఏడో నంబర్ పిల్లర్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించిన బరువు పరీక్షలు విజయవంతం అయ్యాయి. 340 టన్నుల రవాణా కోసం రూపొందించిన వంతెన 510 టన్నుల బరువును సైతం తట్టగలదని నిర్ధారణ అయ్యింది. ఈ ఫలితాల ఆధారంగా పైల్ క్యాప్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 9, 10నుండి ఇతర పిల్లర్లపై శ్లాబ్ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. అందువల్ల రహదారిపై ట్రాఫిక్‌ను ఎక్కువ రోజులు మళ్లించాల్సి ఉండనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.