📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నారా లోకేశ్ సమీక్ష

Author Icon By Sudheer
Updated: February 24, 2025 • 8:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పార్టీ సీనియర్ నేతలతో ఉండవల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రచారానికి తక్కువ సమయం ఉన్నందున టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఓటరును సంప్రదించాలని సూచించారు. ఎన్నికల ముందు రోజు మహాశివరాత్రి పండుగ కావడంతో, ఓటర్లు పోలింగ్ బూత్‌లకు వచ్చేందుకు మంత్రులు, శాసనసభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.

ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు

ఎన్నికల రోజున కేంద్ర కార్యాలయం నుంచి పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ ఆదేశించారు. అన్ని పార్టీ నాయకులు సమిష్టిగా కృషి చేసి, అభ్యర్థుల ఘన విజయాన్ని సాధించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, కంచర్ల శ్రీకాంత్, వేపాడ చిరంజీవి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలి

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, సమన్వయంతో పని చేయడం ద్వారా విజయం సాధించగలమని చెప్పారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటరు తమ హక్కును వినియోగించుకోవాలని, కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కలసికట్టుగా పనిచేసి, ఎన్నికలలో విజయాన్ని ఖాయం చేయాలని పిలుపునిచ్చారు

Google news MLC elections Nara Lokesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.