విజయవాడ :దేశ విదేశీ కంపెనీ భాగస్వామ్యంతో రాష్ట్రం లోని విద్యార్ధుల నైపుణ్యాల్ని పెంచుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగానే ఐటీఐ పరీక్షలో(ITI exam) (వివిధ ట్రేడ్లు) రాష్ట్రానికి చెందిన 17 మంది విద్యార్థులు ‘ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు’ సాధించారని తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో వారిని అభినందించారు.
Read Also: Minister Satyakumar:డీ అడిక్షన్ కేంద్రాల బలోపేతానికి రూ.33.80 కోట్లు
ఢిల్లీలో నిర్వహించిన ‘కౌశల్ దీక్షాంత్ సమారోహ్‘ వేడుకల్లో ప్రధాని మోడీచేతుల మీదుగా టాపర్ సర్టిఫికెట్లు అందుకున్న పి. మధులత (ఆర్అండ్ ఏసీ టెక్నీషి యన్), డి. వందన(పెయింటర్ జనరల్), ఎస్.యామినీ వరలక్ష్మి(వుడ్ వర్క్ టెక్నాలజీ) లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
శ్రీశైలం ఆలయానికి సూర్య కన్స్ట్రక్షన్స్ మినీ బస్సు విరాళం: విజయవాడకు చెందిన సూర్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ(Surya Constructions Company) రూ.23 లక్షల విలువైన మినీ బస్సును శ్రీశైలం దేవస్థానానికి విరాళంగా అందచేసింది. ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా బస్సు తాళం చెవిని దేవస్థానం అధికారులకు అందచేశారు. భక్తుల సౌకర్యార్థంఈబస్సును వినియోగించ నున్నారు. కార్యక్రమంలో సూర్య కన్స్ట్రక్షన్స్ ఎండీ ఎం. శ్రీనివాసరావు, 20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్ వై.సాయిబాబు, శ్రీశైలం దేవస్థానం ఏఈఓ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: