Tirumala laddu case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం శాసనసభలో వెల్లడించనుంది. సోమవారం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేశ్, ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also:AP Inter Exams 2026: ఇంటర్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: లోకేష్
సభలో వాస్తవాల వెల్లడి
శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాస్తవాలను మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి(Nara Lokesh) తెలిపారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వేంకటేశ్వర స్వామికి జరిగిన ఈ మహాపచారాన్ని ఆధారాలతో సహా చట్టసభ వేదికగానే ప్రజల ముందుకు తెస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ వైఖరిపై విమర్శలు
సభకు హాజరుకావడం ప్రజాప్రతినిధులుగా వైసీపీ ఎమ్మెల్యేల కనీస బాధ్యత అని లోకేశ్ గుర్తుచేశారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగి, ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తిని రాజకీయం చేయడం ఆక్షేపణీయమని హితవు పలికారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: