రాష్ట్రంలోని మహిళలకు ప్రత్యేక కానుకగా కూటమి ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ పథకాన్ని (‘Stree Shakti’ scheme) ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం జరిగింది. మహిళల దైనందిన జీవనంలో ఇది ఒక పెద్ద ఉపశమనంగా, స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశంగా నిలిచింది.
నారా లోకేశ్ స్పందన
ఈ పథకంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూపర్ సిక్స్ (Super Six) హామీలలో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం తమ ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సౌకర్యం మాత్రమే కాకుండా, మహిళల గౌరవానికి, స్వేచ్ఛకు, అలాగే ప్రభుత్వంపై వారికున్న విశ్వాసానికి ప్రతీక అని లోకేశ్ అన్నారు.
మహిళా సాధికారతకు ప్రతీక
“ఈ ఉచిత బస్సు టికెట్ కేవలం ఒక ప్రయాణ పాస్ కాదు, ఇది మహిళల సాధికారతకు ప్రతీక” అని లోకేశ్ (Nara Lokesh) వ్యాఖ్యానించారు. సమాన అవకాశాల దిశగా వేస్తున్న ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభిప్రాయపడ్డారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు సమాజంలో మరింత బలంగా, గౌరవంగా నిలిచే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
చారిత్రక సందర్భాన్ని సెలబ్రేట్ చేయాలి
స్త్రీ శక్తి పథకం ప్రారంభం ఒక చారిత్రక మైలురాయి అని పేర్కొంటూ, ఈ సందర్భాన్ని మహిళలు ఒక వేడుకలా జరుపుకోవాలని లోకేశ్ పిలుపునిచ్చారు. బస్సు ప్రయాణ సమయంలో తమ ఉచిత టికెట్తో సెల్ఫీ తీసుకుని, మహిళా సాధికారత యొక్క అర్థాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: