Vetlapalem Firecracker Blast: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర విద్యుత్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
Read Also: Kakinada Fire Accident: బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు
కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. “వేట్లపాలెంలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వార్త తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. ఎంతో మంది నిరుపేద కార్మికులు సజీవ దహనం కావడం మాటలకు అందని విషాదం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది” అని భరోసా ఇచ్చారు.
Vetlapalem Firecracker Blast: వైద్య సహాయంపై ఆదేశాలు
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులను లోకేశ్ ఆదేశించారు. నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలని, అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కాగా, ఈ పేలుడు ధాటికి సుమారు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. పేలుడు తీవ్రతకు భవనం పూర్తిగా ధ్వంసమై, మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయిన దృశ్యాలు చూపరులను కలచివేస్తున్నాయి.
hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: