Nara lokesh : నారా లోకేశ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై సానుకూలంగా స్పందించారు. ఈ బడ్జెట్ దేశ అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని, భారత ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సమతుల్యంగా రూపొందించబడిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లకు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్ ద్వారా ప్రత్యేక లాభాలు ఉంటాయని లోకేశ్ వెల్లడించారు. ముఖ్యంగా క్రిటికల్ మినరల్ కారిడార్, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ, డేటా సెంటర్లకు పన్ను రాయితీలు వంటి ప్రాజెక్టులు రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం రావడం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఈ అవకాశాలను ఉపయోగించుకుని రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ఏపీ భవిష్యత్తుకు కొత్త ఊపు ఇస్తుందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: