Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ మరియు ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారం నెల్లూరు జిల్లా పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది.
Read Also: Medak Murder Case: మందు పార్టీకి పిలిచి చంపేశాడు..!
జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, చంద్రగిరి, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు ఎమ్మెల్యే లు పులివర్తి నాని, నెలవెల విజయశ్రీ, బొజ్జల సుధీర్ రెడ్డి, పాశం సునీల్ కుమార్, ఎం ఎల్ సి బల్లి కళ్యాణ చక్రవర్తి, తుడా చైర్మన్ సి దివాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహచారి ,నరేంద్ర, శ్రీకాళహస్తి ఆర్డిఓ భాను ప్రకాష్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కెవిఎన్ కుమార్, తదితర అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: