Nara Lokesh : అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవచ్చని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh అన్నారు. సోమవారం మంగళగిరి పట్టణంలోని ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన లూథరన్ చర్చిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించడంతో పాటు, చర్చి ప్రాంగణంలో మొక్క నాటారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, దేవుడు మనకు పరీక్షలు పెడతాడని, కానీ వాటిని జయించే శక్తిని కూడా ఆయనే ఇస్తాడని పేర్కొన్నారు. కష్టకాలంలో తోటివారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని చెప్పారు. ఏడాదిలోపే చర్చి నిర్మాణాన్ని పూర్తి చేసిన పునర్నిర్మాణ కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని ఈ నిర్మాణమే నిదర్శనమని అన్నారు.
Read Also: Hyderabad: ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి
ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకే యువత ఆందోళన (Nara Lokesh) చెందుతోందని ఆవేదన వ్యక్తం చేసిన లోకేశ్, పరీక్షల్లో విఫలమయ్యామని జీవితాన్ని ముగించుకోవడం బాధాకరమన్నారు. తన రాజకీయ జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ, 2019లో మంగళగిరిలో ఎదురైన ఓటమిని ఒక పరీక్షగా తీసుకుని ముందుకు సాగానని గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా పనిచేసి మంగళగిరి అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: