Telugu news: Nara Lokesh: అమెరికా పర్యటనలో లోకేష్ కీలక భేటీలు

Read Time:  1 min
Nara Lokesh
Nara Lokesh
FONT SIZE
GET APP

AP IT Development: అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అక్కడి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా, ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అయి ఏపీ ఐటీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

లోకేష్ స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్(Digital Governance), ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లను బలోపేతం చేయడానికి టెక్నాలజీ మద్దతు అవసరమని తెలిపారు. ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధన సహకారం కోసం ఏపీ టెక్ అకాడమీతో భాగస్వామ్యం కోరారు. స్టార్టప్‌లు, SMEలకు సపోర్ట్ చేసే స్కేలబుల్ SaaS మోడల్స్‌ను ఏపీలో విస్తరించాల్సిందిగా అభ్యర్థించారు.

Nara Lokesh key meetings during his US visit

Read also: CM Chandrababu: ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు సీఎం కీలక సూచనలు

సీఈవో వర్మ స్పందిస్తూ

సీఈవో వర్మ స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 500కి పైగా సంస్థలు తమ కస్టమర్లు అని, బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాల ద్వారా AI Ops, మానిటరింగ్ ఆవిష్కరణలు చేస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించారు.

ఏపీలో టెక్ హబ్‌ల అభివృద్ధికి లోకేష్ ప్రయత్నాలు

ఇదే పర్యటనలో, లోకేష్ సెలెస్టా VC మేనేజింగ్ పార్ట్‌నర్ అరుణ్ కుమార్‌తో కూడా సమావేశమయ్యారు. విశాఖను డేటా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలియజేసి, ఏపీలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీకండక్టర్లు, AI, క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

సెలెస్టా VC ప్రధానంగా యుఎస్, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేయాసియాలో పెట్టుబడులు పెడుతుందని, డీప్ టెక్, ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, సైబర్ సెక్యూరిటీ స్టార్టప్‌లపై దృష్టి ఉందని అరుణ్ కుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.