ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ(Delhi)లో పర్యటిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ బోర్డు సమావేశంలో పాల్గొన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల్లో భాగంగా, తొలిసారిగా ఎయిర్ బస్ సంస్థ తమ బోర్డు సమావేశాన్ని భారత్లో నిర్వహించడం గమనార్హం. ఈ సమావేశం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
ఏపీకి ఎయిర్ బస్ను ఆహ్వానించిన లోకేశ్
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, ఏపీని గ్లోబల్ ఏరోస్పేస్ హబ్గా అభివృద్ధి చేయాలన్న సంకల్పాన్ని తెలియజేశారు. ఎయిర్ బస్ (air bus)ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ, విమాన రంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, భూములు, కారిడార్లు అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

మెరుగైన వేదికగా ఏపీ – లోకేశ్ హామీ
“గోల్డ్ స్టాండర్డ్ వేదికగా నిలుస్తుంది ఏపీ”
లోకేశ్ మాట్లాడుతూ, ప్రోగ్రెసివ్ ఏరోస్పేస్ పాలసీ, ప్రత్యేక పన్ను ప్రోత్సాహకాలు, మల్టిపుల్ కారిడార్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులతో రాష్ట్రం సంపన్నంగా ఉందని వివరించారు. ఇకపోతే, అనుమతుల విషయంలో సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా వేగవంతమైన సేవలు అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హాజరు
ఈ సమావేశానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో మెరుగైన భాగస్వామ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలను వివరించారు.
ఎయిర్ బస్కు మేలు చేసే రాష్ట్రంగా ఏపీ!
“విభిన్నమైన పారిశ్రామిక వాతావరణంతో ముందుకు సాగుతున్నాం” – లోకేశ్
ఏరోస్పేస్ రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఏపీతో భాగస్వామ్యం ఎయిర్ బస్కు మేలే అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఎయిర్ బస్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతుగా ఉంటుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: