📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Lokesh: మంత్రి లోకేష్ చొరవతో గ్రీన్‌ ఛాలెల్‌ ద్వారా గుండె తరలింపు

Author Icon By sumalatha chinthakayala
Updated: March 28, 2025 • 8:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Lokesh: ఏపీ మంత్రి నారా లోకేశ్ చొరవతో గుంటూరులోని రమేష్ ఆసుపత్రి నుంచి తిరుపతికి గ్రీన్ ఛానల్ ద్వారా ఒక మహిళ గుండెను విజయవంతంగా తరలించారు. చెరుకూరి సుష్మ అనే మహిళ గుంటూరు రమేష్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఆస్పత్రి వైద్యులు ఆమె కుటుంబసభ్యులకు అవయవదానంపై అవహాన కల్పించారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు అవయవదానం చేయడానికి అంగీకరించారు. దీంతో ఆసుపత్రి వైద్యులు మంత్రి నారా లోకేష్‌ను సంప్రదించారు. అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఆస్పత్రి వైద్యుల అభ్యర్థనకు మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు.

సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు

బ్రెయిన్‌డెడ్‌ అయిన మహిళ గుండెను తరలించేందుకు తన సొంత ఖర్చుతో ఏర్పాట్లు చేయించారు. గుండెను తరలించేందుకు వీలుగా లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేయించారు. అలాగే బ్రెయిన్ డెడ్ అయిన మహిళ గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి చేరే వరకూ గ్రీన్‌ఛానల్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లోకేష్ ఆదేశాలతో గుంటూరు నుంచి తిరుపతికి గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి.. గుండెను తరలించారు. గుంటూరు నుంచి తొలుత గన్నవరం విమానాశ్రయానికి తరలించిన అధికారులు.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి గుండెను తరలించారు. రేణిగుంట నుంచి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోంది

మరోవైపు తన భార్య అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడినట్లు బ్రెయిన్ డెడ్ అయిన మహిళ భర్త శ్రీనివాస్ తెలిపారు. వెంటనే రమేష్ ఆస్పత్రికి తీసుకొచ్చామని వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె కోమాలోకి వెళ్లారని అన్నారు. ఆ తర్వాత బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు చెప్పారని.. అవయవదానం గురించి వివరించారన్నారు. ఆస్పత్రి యాజమాన్యం, మంత్రి నారా లోకేష్ సహకారంతో తిరుపతిలో ఉన్న వారికి గుండె అందించడం బాధలోనూ సంతోషాన్ని ఇస్తోందని అభిప్రాయపడ్డారు.

Google news Google News in Telugu Green Channel Heart transplant Latest News in Telugu Minister Lokesh Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.