Nara Lokesh: చదువుకునే విద్యార్థులకు వృత్తినైపుణ్యాలను అందించేందుకు గానూ ఇంటర్న్షిప్ కార్యక్రమం పక్కాగా నిర్వహించేందుకు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ నేతృత్వంలో నలుగురు శాసనసభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తామని బుధవారం మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించారు. అంతకు ముందు శాసనసభలో యార్లగడ్డ మాట్లా డుతూ ఇంజనీరింగ్తో పాటు డిగ్రీ విద్యార్థులకు కళాశాల నుండి చదువు పూర్తిచేసుకుని బయటకు వచ్చే సమయానికి వారికి ఉద్యో గావకాశాలు కల్పించాలంటే సరైన నైపుణ్యశిక్షణ అవసరమన్నారు.
Read Also: TTD Fake Websites: నకిలీ టీటీడీ వెబ్సైట్లపై విజిలెన్స్ కొరడా!
ఇంటర్న్షిప్ అవశ్యకతపై యార్లగడ్డ ప్రతిపాదన
ఇందుకోసం ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పరిశ్రమల్లో విద్యార్థులకు ఇంటర్నషిప్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జిఓ జారీ చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇదే తరహాలో తాను కెడిసిసి చైర్మన్ గా పనిచేసిన సమయంలో 120 మంది విద్యార్థులకు ఇంటర్నషిప్ చేసే అవకాశం కల్పించటంతో వారిలో 40మందికి పైగా హైదరాబాద్లో ప్రముఖసంస్థల్లో ఉద్యోగాలు లభించాయని ఉదహరించారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఏఐ, డేటా సైన్స్, సర్వీస్ వంటి భవిష్యత్ కోర్సులో హెచ్సిఎల్ సహకారంతో నైపుణ్యశిక్షణ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించాలని యార్లగడ్డ కోరారు.
మంత్రి లోకేష్ సానుకూల స్పందన
యార్లగడ్డ ప్రస్తావించిన అంశాలకు మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ ఇంటర్న్షిప్ విద్యార్ధులకు ఉపయోగపడే మంచి కార్యక్రమం అన్నారు. కేవలం ప్రభుత్వం జిఓ ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదని దానిని సక్రమంగా నిర్వహించేలా మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. తాను మూడు సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహణపై యార్లగడ్డ నేత ృత్వంలో కమిటీ నియమించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసారు. ఈకమిటీ ఇంటర్న్షిప్ పై అధ్యయనం చేసి తగు సూచనలు సలహాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ సభలో కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: