📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Nara Lokesh: ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీతో ఏపీ కీలక భాగస్వామ్యం

Author Icon By Pooja
Updated: October 22, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యావకాశాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన, గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో సమావేశమై పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా, ఏపీలో గ్రిఫిత్ యూనివర్సిటీకి సంబంధించిన ఇండియా సెంటర్ లేదా హబ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read also: CM Revanth reddy: రాష్ట్రాభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం

మంత్రి లోకేశ్ ప్రతిపాదనలు, భవిష్యత్తు ప్రణాళికలు:

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్(Nara Lokesh), గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్న రంగాలను వివరించారు:

అంతర్జాతీయ ఆహ్వానం: వచ్చే నెల 14, 15 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించనున్న ‘పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ – 2025’ మరియు ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరమ్'(‘Global Education Forum’) సమావేశాలకు హాజరుకావాలని మంత్రి లోకేశ్, మార్నీ వాట్సన్‌ను ఆహ్వానించారు.

గ్రిఫిత్ యూనివర్సిటీ వివరాలు: మార్నీ వాట్సన్ తమ విశ్వవిద్యాలయం గురించి వివరిస్తూ, 1975లో స్థాపించిన గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉందని తెలిపారు. ఐదు క్యాంపస్‌లలో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, భారత్‌లో ఇప్పటికే ఐఐటీ రూర్కీతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Griffith University AP Nara Lokesh Australia Visit Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.