Telugu News: Nara Lokesh: ఆస్ట్రేలియా గ్రిఫిత్ యూనివర్సిటీతో ఏపీ కీలక భాగస్వామ్యం

Read Time:  1 min
Nara Lokesh
Nara Lokesh
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యావకాశాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన, గోల్డ్ కోస్ట్ క్యాంపస్‌లో యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్) మార్నీ వాట్సన్‌తో సమావేశమై పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా, ఏపీలో గ్రిఫిత్ యూనివర్సిటీకి సంబంధించిన ఇండియా సెంటర్ లేదా హబ్‌ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read also: CM Revanth reddy: రాష్ట్రాభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం

Nara Lokesh

మంత్రి లోకేశ్ ప్రతిపాదనలు, భవిష్యత్తు ప్రణాళికలు:

ఈ సమావేశంలో మంత్రి లోకేశ్(Nara Lokesh), గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్న రంగాలను వివరించారు:

  • సహకార రంగాలూ: పబ్లిక్ పాలసీ, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ వంటి కీలక రంగాల్లో కలిసి పనిచేయడానికి ఏపీ ఆసక్తిగా ఉంది.
  • డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్: ఎస్‌ఆర్‌ఎం-ఏపీ, ఆంధ్రా యూనివర్సిటీ, విట్-ఏపీ వంటి ఏపీలోని ప్రముఖ విద్యాసంస్థలతో కలిసి డ్యూయల్-డిగ్రీలు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్‌లను అభివృద్ధి చేయాలని లోకేశ్ సూచించారు.
  • నైపుణ్య ధ్రువీకరణ: సిలబస్ రూపకల్పన, విద్యార్థులకు నైపుణ్య ధ్రువీకరణ (Skill Certification) కోసం ఏపీఎస్‌ఎస్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) తో భాగస్వామ్యం కావాలని కోరారు.
  • ఉమ్మడి పరిశోధన: పునరుత్పాదక శక్తి (Renewable Energy), ప్రజారోగ్యం, నీటి నిర్వహణ వంటి భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన అంశాలపై సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించారు.
  • స్టార్టప్ ప్రోత్సాహం: ఏపీలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో కలిసి పనిచేయాలని లోకేశ్ కోరారు.

అంతర్జాతీయ ఆహ్వానం: వచ్చే నెల 14, 15 తేదీల్లో రాష్ట్రంలో నిర్వహించనున్న ‘పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ – 2025’ మరియు ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫోరమ్'(‘Global Education Forum’) సమావేశాలకు హాజరుకావాలని మంత్రి లోకేశ్, మార్నీ వాట్సన్‌ను ఆహ్వానించారు.

గ్రిఫిత్ యూనివర్సిటీ వివరాలు: మార్నీ వాట్సన్ తమ విశ్వవిద్యాలయం గురించి వివరిస్తూ, 1975లో స్థాపించిన గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రపంచంలోని అగ్రశ్రేణి పబ్లిక్ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఉందని తెలిపారు. ఐదు క్యాంపస్‌లలో 50 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, భారత్‌లో ఇప్పటికే ఐఐటీ రూర్కీతో కలిసి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మంత్రి లోకేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.