Nandamuri Balakrishna: ప్రముఖ సినీ నటుడు, టీడీపీ (TDP) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని వనం కాలనీలో శుక్రవారం ఆయన సతీమణి వసుంధరతో కలిసి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో ఆయన హిందూపురంలోనే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నట్లు స్పష్టమైంది.
Read Also: Jagan Brahmanandam Meet: వైఎస్ జగన్ను కలిసిన నటుడు బ్రహ్మానందం

ఇకపై హిందూపురంలోనే శాశ్వత నివాసం
హిందూపురం పట్టణ సమీపంలోని వనం కాలనీలో 81 సెంట్ల విస్తీర్ణంలో ఈ ఇంటిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా, ఇకపై హిందూపురమే తన కేరాఫ్ అడ్రస్ అవుతుందని బాలకృష్ణ తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. సొంత ఇంటి నిర్మాణంతో నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: