తవణంపల్లె (చిత్తూరు) : మండల మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు శనివారం రాత్రి దారుణ హత్యకు (Murder) గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు రంగయ్యనాయుడు కాళ్ళు చేతులను తాళ్ళతో బంధించి ఇంటి ముందు వున్న ట్రాక్టర్ షెడ్డు వద్ద తాడుతో ఉరివేసి హత్య చేశారు. ఈసంఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో సంచలనం రేపింది. స్థానిక పోలీసుల కథనం మేరకు గత 15 సంవత్సరాల క్రితం మండల వైస్ ఎంపీపీగా పనిచేసిన తెల్లగుండ్లపల్లె రంగయ్యనాయుడు తెల్లగుండ్లపల్లెలో ప్రస్తుతం స్వగ్రామం భార్యతో కలసి నివాసముంటున్నారు. ఈనేపథ్య ంలో భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని కుమారుడు వద్దకు వెళ్ళింది. దీనితో కుమార్తె, అల్లుడు రంగయ్యనాయుడుకు తోడుగా ఇంటిలో వుంటున్నారు.
వివాదాలు లేని రంగయ్యనాయుడు హత్యపై అనుమానాలు, పోలీసుల దర్యాప్తు ముమ్మరం
శనివారం రాత్రి భోజనం అనంతరం కుమార్తె, అల్లుడుతో కలసి రంగయ్యనాయుడు ఇంటిలో నిద్రించారు. అయితే ఆదివారం వేకువజామున సుమారు 5.45 గంటలకు ఇంటి ముందు ట్రాక్టర్ షెడ్డు వద్ద హత్యకు గురై వేలాడుతుండడాన్ని పక్క ఇంటివారు గమనించి రంగయ్యనాయుడు కుటుంబసభ్యులకు తెలపగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య (Murder) చేసినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు చిత్తూరు డీఎస్పీ సాయినాధ్, రూరల్ వెస్ట్ సిఐ శ్రీధర్ నాయు డులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అలాగే చిత్తూరు నుండి పోలీసు జాగిలాలు, క్లూస్ టీం సంఘటనా స్థలంలో వేలిముద్రలను, ఆధారాలను సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ నాయుడు తెలిపారు. ఇదిలా వుండగా గ్రామంలో కొంత మంది యువకులతో జరిగిన చిన్నపాటి గొడవల వల్లే రంగయ్యనాయుడు హత్యకు గురై వుంటారనే కోణంలో పోలీసులు గ్రామానికి చెందిన కొంత మంది యువకులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడు అయిన రంగయ్యనాయుడును ఎవరు? ఎందుకు హత్య చేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tamil Nadu: సాంబారులో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య