విజయవాడలో ఓ హృదయవిదారకమైన హత్యా ఘటన జరిగింది. ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న ఓ వృద్ధుడు పని మనిషి చేతిలో దారుణంగా హతమయ్యాడు (Murder). ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే…
బొద్దులూరి వెంకట రామారావు (70) అనే వృద్ధుడు తన వృద్ధ తల్లి సరస్వతితో కలిసి విజయవాడ (Vijayawada) నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్నారు. వృద్ధ తల్లిని చూసుకోవడానికి, ఇళ్ల పనులకు సహాయపడేందుకు రామారావు ఇటీవలే అనూష అనే మహిళను పనిమనిషిగా (woman is a maid) నియమించారు. అనూష కూడా అదే ఇంట్లో వారితో కలిసి నివసించేది. ఈ పరిచయం అత్యంత విషాదకర మలుపు తిప్పింది.
అర్ధరాత్రి ఘోర ఘటన
గత అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో రామారావు గదిలో లైట్లు వెలిగి ఉండటంతో అనుమానం వచ్చిన సరస్వతి వచ్చి చూడగా కుమారుడు అపస్మారక స్థితిలో మంచంపై పడి ఉండటంతో ఆందోళన చెందారు. మంచం మీద, రామారావుపై కారం చల్లి ఉండటాన్ని గమనించారు. పనిమనిషి అనూష కనిపించకపోవడం, బీరువా పగలగొట్టి ఉండటంతో పక్కింటి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల స్పందన
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ ఉదయం ఆరు గంటల సమయంలో అనూషను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. నిందితురాలు తన భర్త సాయంతో రామారావు ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపి (Murder) అనంతరం ఇంట్లోని బంగారు నగలు, నగదు తీసుకుని పరారయ్యారు. పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు .
హత్య అంటే ఏమిటి?
హత్య అంటే మరొక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా చంపడం . ఇది ఇంగ్లీష్ చట్టంలో అత్యంత తీవ్రమైన నేరం మరియు అందువల్ల తప్పనిసరి ‘జీవిత ఖైదు’ విధించబడుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: TTD: తిరుమల లో15,16 రెండు రోజులు విఐపి బ్రేక్ రద్దు