📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

MS Raju: కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్

Author Icon By Tejaswini Y
Updated: December 25, 2025 • 2:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

MS Raju: చాలాకాలం విరామం తర్వాత బహిరంగ వేదికపై కనిపించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడుల పేరుతో ఎంవోయూలకు హైప్ సృష్టించడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సును గుర్తు చేస్తూ, అప్పట్లో లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రచారం జరిగిందని, అయితే ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టింది కార్పొరేట్ ప్రతినిధులు కాదు, స్టార్ హోటళ్లలో పనిచేసే వంటకారులు, సప్లయర్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

MS Raju: TDP MLA counters KCR’s comments

ఈ వ్యాఖ్యలకు మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు(MS Raju) ఘాటుగా స్పందించారు. ప్రజల ఎదుట నిలబడలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఏ మద్యం సేవించి బయటకు వచ్చారో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు పరాజయం పాలవడంతో మానసిక సమతుల్యత కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

అంతేకాదు, కేటీఆర్ సామర్థ్యంపై కూడా కేసీఆర్‌కు నమ్మకం లేదని, అదే కారణంగా ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పూర్తిగా బలహీనపడిందని, రాజకీయంగా కనుమరుగయ్యే దశకు చేరుకుందని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics BRS party Chandrababu Naidu KCR MOU Controversy MS Raju TDP Party Telangana politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.