MS Raju: కేసీఆర్ వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే కౌంటర్

Read Time:  1 min
MS Raju
MS Raju
FONT SIZE
GET APP

MS Raju: చాలాకాలం విరామం తర్వాత బహిరంగ వేదికపై కనిపించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడుల పేరుతో ఎంవోయూలకు హైప్ సృష్టించడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఎద్దేవా చేశారు. విశాఖలో జరిగిన సీఐఐ సదస్సును గుర్తు చేస్తూ, అప్పట్లో లక్షల కోట్ల పెట్టుబడులపై ప్రచారం జరిగిందని, అయితే ఆ ఒప్పందాలపై సంతకాలు పెట్టింది కార్పొరేట్ ప్రతినిధులు కాదు, స్టార్ హోటళ్లలో పనిచేసే వంటకారులు, సప్లయర్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

MS Raju: TDP MLA counters KCR’s comments

ఈ వ్యాఖ్యలకు మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు(MS Raju) ఘాటుగా స్పందించారు. ప్రజల ఎదుట నిలబడలేక కేసీఆర్ రెండేళ్లుగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఏ మద్యం సేవించి బయటకు వచ్చారో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులు పరాజయం పాలవడంతో మానసిక సమతుల్యత కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

అంతేకాదు, కేటీఆర్ సామర్థ్యంపై కూడా కేసీఆర్‌కు నమ్మకం లేదని, అదే కారణంగా ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పూర్తిగా బలహీనపడిందని, రాజకీయంగా కనుమరుగయ్యే దశకు చేరుకుందని ఎంఎస్ రాజు వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.