📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Montha Cyclone: తుపాను నష్టం అర్థం చేసుకున్నాం.. కేంద్రానికి నివేదిస్తాం

Author Icon By Sushmitha
Updated: November 11, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒంగోలు: మొంథా తుఫాను (Montha Cyclone) కారణంగా ప్రకాశం జిల్లాకు కలిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలమని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి బృందం భరోసా ఇచ్చింది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ సోమవారం జిల్లాలో పర్యటించింది.

Read Also: Delhi Bomb Blast : ఢిల్లీ పేలుడు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

Montha Cyclone

కేంద్ర బృందం పరిశీలనలు

కేంద్ర బృందంలో పి. పౌసుమి బసు, మహేష్ కుమార్, శశాంక్ శేఖర్ రాయ్, సాయి భగీరథతో పాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఉన్నారు. ఒంగోలుకు చేరుకున్న బృందానికి కలెక్టర్ పి. రాజాబాబు స్వాగతం పలికారు. జిల్లాలో వ్యవసాయం, రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, పంచాయతీరాజ్ రోడ్లు, విద్యుత్, పశుసంవర్ధక శాఖలతో పాటు ఒంగోలు నగరంపై తుఫాను చూపిన తీవ్ర ప్రభావాన్ని కలెక్టర్ వివరించారు. నష్టాన్ని తెలిపే ఫోటో ప్రదర్శన, తుఫానుకు ముందు, తర్వాత పరిస్థితిని వివరించే వీడియోను కేంద్ర బృందం వీక్షించింది.

అనంతరం బృందం అల్లూరు, కొప్పోలు ప్రాంతాల్లోని రొయ్యల చెరువులు మరియు వరి పొలాలను సందర్శించింది. నాగులుప్పలపాడులో దెబ్బతిన్న పత్తి పంటను పరిశీలించింది. వరి దుబ్బులు కుళ్లిపోవడం, పత్తి పంటలకు వేర్లలో ఫంగస్ వ్యాపించడం వలన మరో పంట వేసే అవకాశం కూడా లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతికి పంట చేతికొచ్చేదని, కానీ పరిస్థితి తారుమారైందని వారు వాపోయారు.

ప్రజాప్రతినిధుల వినతులు

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, ఒంగోలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ కేంద్ర బృందానికి నష్టం వివరాలు తెలిపారు. అల్లూరు చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఏర్పడినప్పుడు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చిన తీరును అధికారులు వారికి వివరించారు. ఎమ్మెల్యే బి.ఎన్. విజయ్ కుమార్,(B.N. Vijay Kumar) రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎం. శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజా సంఘాల నాయకులు కూడా కేంద్ర బృందాన్ని కలిసి, జిల్లాకు జరిగిన నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ఆదుకోవాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Central team crop damage flood assessment. Google News in Telugu Latest News in Telugu montha cyclone Ongole prakasam district Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.