ఆంధ్రప్రదేశ్పైకి మొంథా తుఫాన్ (Montha Cyclone) దూసుకురాబోతుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం ఇప్పటికే వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది కాకినాడకు సుమారు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. సోమవారం తుఫాన్గా, మంగళవారం తీవ్ర తుఫాన్గా మారి ప్రభావం చూపే అవకాశం ఉందని తాజా వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి.
AP:విత్తనాల బీమాకు నిధులను విడుదుల చేసిన ప్రభుత్వం
కాగా.. మొంథా తుఫాన్ (Montha Cyclone)హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అలెర్ట్ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర-దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ ఆలర్ట్ జారీ ఇచ్చింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీయార్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది
ఎన్టీఆర్ జిల్లాపై మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రేపటి నుంచి మూడు రోజులపాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కృష్ణా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించగా.. తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27, 28న సెలవు ప్రకటించారు.
అంతేకాకుండా.. తుఫాన్ ప్రభావం దృష్ట్యా మరికొన్ని జిల్లాల్లోనూ సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.మొంథా తుఫాన్ హెచ్చరికతో ఏపీ వైద్యారోగ్యశాఖ అప్రమత్తం అయింది. NDRF, SDRF టీమ్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. కలెక్టరేట్, RDO, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా.. మొంథా తుఫాన్ హెచ్చరికలు ఏపీని భయపెడుతుండడంతో ప్రభుత్వం అలెర్ట్ అయింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: