శ్రీశైలం ఆలయ దర్శనంతో ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ(Modi Kurnool Visit) ఈ నెల 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లా పర్యటన షెడ్యూల్ను ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) అధికారికంగా ప్రకటించింది.
మోదీ ఉదయం 11:15 గంటలకు శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపింది. అనంతరం 12:15 గంటలకు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు.
Read also: Amaravati Rajbhavan : రూ.212 కోట్లతో అమరావతిలో రాజ్ భవన్

పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపన
మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలులో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లకు శంకుస్థాపన జరగనుంది. ఈ సందర్భంగా రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు కూడా మోదీ(Modi Kurnool Visit) చేతుల మీదుగా జరుగుతాయని PMO పేర్కొంది.
బహిరంగ సభలో ప్రసంగం
ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల తర్వాత ప్రధాని మోదీ ప్రజలతో బహిరంగ సభలో ప్రసంగం చేయనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాధాన్య ప్రాజెక్టులపై చర్చ జరగనుందని అధికారులు తెలిపారు.
ప్రధాని మోదీ ఏ తేదీన కర్నూలు వస్తారు?
అక్టోబర్ 16న.
మోదీ పర్యటన ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది?
శ్రీశైలం ఆలయంలో పూజలతో.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: