MLC Anantha Babu: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు తాజాగా మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు. గత కొన్ని రోజులుగా తాను పరారీలో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. “నేను ఎక్కడికీ పారిపోలేదు, నాకు పోలీసుల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. కేవలం కొన్ని వ్యక్తిగత పనుల వల్ల బిజీగా ఉండటం వల్ల అందుబాటులో లేను. దానిని పరారీగా చిత్రీకరించడం దురదృష్టకరం” అని ఆయన పేర్కొన్నారు. డిఫాల్ట్ గా ఉన్న బెయిల్ ను సుప్రీంకోర్టు పర్మినెంట్ చేసిందని స్పష్టం చేశారు.
Read Also: Tirupati Police Gramasabha: గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు
పార్టీతో లింక్ పెట్టి చూడొద్దు
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కూటమి ప్రభుత్వం.. తన డ్రైవర్ హత్యకేసును హైలైట్ చేస్తుందన్నారు. వైసీపీలో యాక్టివ్ గా ఉన్నవారిని ఏదొకరకంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కాగా.. డ్రైవర్ హత్యకేసులో అరెస్టయ్యాక పోలీసులు తనకు సహకరించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అదే జరిగితే ఏడునెలలు జైల్లో ఉండాల్సిన పనిలేదన్నారు. 90 రోజులకే బెయిల్ పై బయటికి వచ్చేవాడినని, దీనిని బట్టి తనకెవరూ సహకరించలేదని తెలుస్తుందన్నారు. తనకు జరిగినదాన్ని పార్టీతో లింక్ పెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఒక క్యాస్ట్ కు, పార్టీకు ఆపాదించి చూడొద్దన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: