📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:MLA Madhavireddy: హైకోర్టులో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి దొరకని ఊరట

Author Icon By Pooja
Updated: October 17, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కడప మున్సిపల్ కార్పొరేషన్ వ్యవహారానికి సంబంధించిన ఒక కీలక కేసులో టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డికి(MLA Madhavireddy) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కార్పొరేషన్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు(High Court)కొట్టివేసింది. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీసుకున్న తీర్మానాలను రద్దు చేసే అధికారం కమిషనర్‌కు లేదని, రాష్ట్ర ప్రభుత్వానికే ఆ అధికారం ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Read Also: Metro Rail:డబుల్ డెక్కర్ వంతెనలకు బ్రేక్.. నిర్వహణ ఖర్చులే కారణమా?

కేసు నేపథ్యం మరియు సింగిల్ జడ్జి తీర్పు:

హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం:

సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి(MLA Madhavireddy) హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. మాధవిరెడ్డి తరఫు న్యాయవాది జవ్వాజి శరత్‌చంద్ర వాదనలు వినిపిస్తూ, ఎక్స్-అఫీషియో సభ్యురాలైన ఎమ్మెల్యేకు సమావేశానికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదని, కాబట్టి తీర్మానాలు చెల్లవని వాదించారు. సురేశ్‌బాబు తరఫు న్యాయవాది వీఆర్‌రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ, సమావేశంలో ప్రజాహిత తీర్మానాలే చేశారని, తీర్మానాలు చేసి నెలలు గడుస్తున్నా కమిషనర్ లేదా కార్పొరేటర్ల నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని తెలిపారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవద్దని ఆయన కోరారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మరియు జస్టిస్ ఆర్. రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, మాధవిరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

High Court Appeal Dismissed Kadapa Municipal Corporation Latest News in Telugu TDP MLA Madhavi Reddy Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.