News Telugu: Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి

Read Time:  1 min
Mithun Reddy
Mithun Reddy
FONT SIZE
GET APP

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (pawan kalyan) చేసిన భూకబ్జా ఆరోపణలపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న పవన్ ఆరోపణలను ఆయన ఖండిస్తూ, ఆ భూమి తమ చట్టబద్ధమైన సొత్తు అని స్పష్టం చేశారు. పవన్ చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. “మా కుటుంబం ఆ భూమిని 2000 సంవత్సరంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసింది. హెలికాప్టర్‌లో చూపించిన భూమి మా సొంతం” అని మిథున్ రెడ్డి తెలిపారు.

Mithun Reddy

Mithun Reddy: పవన్ ఆరోపణలపై స్పందించిన ఎంపీ మిథున్ రెడ్డి

Read also: Nara Lokesh: విశాఖలో పలు ప్రొజెక్టులకు నారా లోకేష్ శంకుస్థాపన

మంగళం పేట ప్రాంతాన్ని

పవన్ కళ్యాణ్ హెలికాప్టర్‌లో తూర్పు కనుమల పరిధిలోని మంగళం పేట ప్రాంతాన్ని పరిశీలించి, పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమించిందని ఆరోపించారు. ఆయన ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మిథున్ రెడ్డి ఇచ్చిన కౌంటర్‌తో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ఆసక్తిగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.