Mission Vatsalya AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అనాథలు, నిరాశ్రయులైన పిల్లల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకంలో భాగంగా ‘రక్షణ మరియు విద్య’ (Protection and Education) కేటగిరీ కింద అర్హత పొందిన ప్రతి బిడ్డకు నెలకు రూ. 1750 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. పిల్లల ప్రాథమిక అవసరాలు, విద్యా ఖర్చుల కోసం ఈ నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది.
Read Also: Census 2027 India: జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల

నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ (NCF) ద్వారా నిధులు
ఈ పథకానికి అవసరమైన ఆర్థిక వనరులను నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ (NCF) ద్వారా కేటాయించనున్నారు. దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్న పిల్లల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిధిని నిర్వహిస్తోంది. నిధుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా అధికారులు పర్యవేక్షించనున్నారు. ఇది అనాథ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.టెర్రరిస్ట్ హింస, ఎల్డబ్ల్యూఈ, సరిహద్దు కాల్పుల కారణంగా అనాధలైన పిల్లలకు విద్య, సంరక్షణ కోసం ఈ సాయం అందజేయబడుతుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: