కృష్ణా జిల్లాలోని డోకిపర్రు గ్రామం (Dokiparru village in Krishna district) గురువారం వేరేలా జిగేల్మంది. ఎందుకంటే మిస్ వరల్డ్ (Miss World) ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మరియు మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ అక్కడ సందర్శనకు వచ్చారు. వీరి రాకతో గ్రామం పండుగ వాతావరణంగా మారింది.తెలుగు సంప్రదాయ పట్టు చీరల్లో ముస్తాబై వచ్చిన ఈ అందాల తారలను గ్రామస్తులు ఆత్మీయంగా ఆహ్వానించారు. హారతులు ఇచ్చారు, కుంకుమ బొట్లు పెట్టి సాదరంగా పలికారు. ఒక ప్రపంచ సుందరి గ్రామానికి వచ్చిందంటే ప్రజల్లో ఎంత ఉత్సాహమో అర్థం చేసుకోవచ్చు.ఈ సందర్భంగా వారు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ స్థానిక కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం చూసి మురిసిపోయారు. భారతీయ సాంప్రదాయ కళలు అద్భుతంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు.
బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం
తర్వాత జరిగిన ముఖ్యమైన కార్యక్రమం ఏమిటంటే, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభం. ఇది సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఈ కేంద్రాన్ని ఈ ఇద్దరు ప్రపంచ సుందరీమణులు ప్రారంభించారు.ఓపల్ సుచాత మాట్లాడుతూ, తాను 16 ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్ బాధితురాలిగా మారానని చెప్పారు. కానీ మొదటి దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవడంతో తాను పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. ఆరోగ్యం విషయంలో అవగాహన ఎంతో ముఖ్యం అన్నారు.మిస్ ఆసియా కృష్ణా మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం కీలకంగా మారుతుందని అన్నారు.
ఉచిత పరీక్షలతో ముందడుగు
సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత సుధారెడ్డి మాట్లాడుతూ, మహిళల కోసం ఉచితంగా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నాం, అన్నారు. గుడ్లవల్లేరు మండలాన్ని P4 పథకం కింద దత్తత తీసుకున్నామన్నారు. త్వరలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నామని వెల్లడించారు.అంతేకాకుండా, ఆగస్టు 28న హైదరాబాద్లో “పింక్ పవర్ రన్ 2.0” అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనివల్ల మరిన్ని మహిళలకు క్యాన్సర్పై అవగాహన కల్పించగలమని ఆశించారు.
Read Also :